.jpg&w=3840&q=75)

బ్రిక్స్ కూటమికి ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న భారత్ స్వతంత్రంగా వ్యవహరించి ఇరాన్పై జరుగుతున్న దురాక్రమణలను అడ్డుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కోరారు. పశ్చిమాసియాలో విదేశీ జోక్యం లేకుండా ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పడాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ఫోన్లో చర్చించారు.
ఈ సందర్భంగా అమెరికా తమపై సైనిక దాడులు అణ్వాయుధాల నియంత్రణ పేరుతో చేస్తున్నాయని చెప్పడాన్ని ఇరాన్ అధ్యక్షుడు ఖండించారు. తమ దేశం అణ్వాయుధాల అభివృద్ధికి వ్యతిరేకమని, దివంగత సుప్రీంనేత ఖమేనీ కూడా ఈ అంశంపై కఠినంగా వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. అణ్వాయుధాలపై ఎలాంటి ముందడుగు వేయకూడదని మతపరమైన, పాలనపరమైన ఆదేశాలు ఉన్నాయని వివరించారు.
ఇక మోదీ పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. నౌకాయాన స్వేచ్ఛను కాపాడాలని, సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షించారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!