
సినిమాలు

ఇటీవల విడుదలైన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మర్దాని 3 మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక స్ట్రీమింగ్ తేదీ ప్రకటించబడింది. రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మర్దాని ఫ్రాంచైజ్లో మూడో భాగంగా తెరకెక్కింది. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ ఫ్రాంచైజ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన మర్దాని 3లో జాంకీ బోడియావాలా, జిష్షు సేన్గుప్తా, ఇంద్రనీల్ సేన్గుప్తా కీలక పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడ్యూరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా, సంగీతాన్ని సార్థక్ కళ్యాణి సమకూర్చారు. ఆకట్టుకునే కథ, బలమైన నటనతో ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!