

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ మరియు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు మంత్రి ఆనం సీఎంకు తెలిపారు.
నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశామని మంత్రి ఆనం సీఎంకు వివరించారు. వేద పండితులు, అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!