

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్గాట్-వేఫర్ ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అగ్రస్థానానికి చేరే అవకాశముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ సమీపంలోని ఈ ప్రాంతం త్వరలోనే అభివృద్ధి చెందిన రంగారెడ్డి జిల్లాను తలపించేలా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ వినియోగం కీలక సూచికగా నిలుస్తుందని సీఎం చెప్పారు. అందుకే విద్యుత్ ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. 90 గిగావాట్ల మేరకు ఎంఓయూలు సిద్ధమై ఉన్నాయని, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తోందని తెలిపారు. గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!