

కాళేశ్వరం క్షేత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అదే సందర్భంగా రూ.3.71 కోట్లతో ఆర్టీసీ మోడల్ బస్టాండ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సాయంత్రం కాళేశ్వరం చేరుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ఇంజినీరింగ్ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమాల అనంతరం కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన రైతు ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆలయ అభివృద్ధితో పాటు ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.



















.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!