
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరుకు బయల్దేరనున్న ఆయన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హోసూరు సమీపంలోని తాలి ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొనగా, ఆవడిలో రోడ్ షో నిర్వహించనున్నారు. రెండో రోజు మధురై, సాత్తూర్ ప్రాంతాల్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!