

అనన్య క్రియేషన్స్ బ్యానర్పై కైలాష్ దుర్గం నిర్మాణంలో, జోయల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తెరచాప” చిత్రం ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. నవీన్ రాజ్ శంకరాపు, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటించగా, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో, చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా కోసం పడిన కష్టాలను వివరించారు. సముద్ర తీరంలో కఠిన పరిస్థితుల్లో చిత్రీకరణ జరిపి, మత్స్యకారుల జీవన విధానాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. హీరో నవీన్ రాజ్ ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు భావోద్వేగంగా చెప్పారు. చిత్ర బృందం అంతా కలిసి పనిచేసిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!