

అమరావతి, ఈ నెల 28: సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. అలనాటి ప్రఖ్యాత నటి, గాయని, నిర్మాత, స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవిత చరిత్రను పుస్తకంలో వివరించారని సీఎం తెలిపారు. ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉండే కృష్ణవేణి జీవితాన్ని ప్రజలకు చేరవేయడం సంతోషంగా ఉందని అన్నారు. మనదేశం సినిమాతో మహానటుడు ఎన్.టి. రామారావు గారిని తెలుగు సినీ రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణి గారిని ఆయన ఎంతో గౌరవించారన్నారు.
పుస్తకావిష్కరణకు కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాని బ్రహ్మం, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్, శ్రీమతి ఝాన్సీ రాణి, యువహీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణలు పాల్గొన్నారు. పుస్తక రచయిత భగీరథ మాట్లాడుతూ, తన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!