
సినిమాలు
.jpg&w=3840&q=75)
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇండిగో విమానాలు భారీ స్థాయిలో అంతరాయాలకు గురైన నేపథ్యంలో, ఆ పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యుల కమిటిని ఏర్పాటు చేసింది. విమానాల ఆలస్యం, రద్దులకు దారితీసిన కార్యాచరణ, పరిపాలనా మరియు సమన్వయ లోపాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
ఈ కమిటీలో జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె. బ్రంహానే, డెప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, క్యాప్టెన్ కపిల్ మంగళిక్ (SFOI), క్యాప్టెన్ లోకేష్ రాంపాల్ (FO) ఉన్నారు. మొత్తం పరిస్థితి పై సమగ్ర నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇటువంటి అంతరాయాలు పునరావృతం కాకుండా సూచనలు కూడా నివేదికలో ఉండనున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!