
టెక్నాలజీ

తెలంగాణలో అత్యంత గుర్తింపు పొందిన పోలీస్ అధికారుల్లో ఒకరైన వీసీ సజ్జనార్ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు.దిశా అత్యాచారం – హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ అనంతరం సజ్జనార్ పేరు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత ఆర్టీసీ ఎండిగా పని చేస్తూ, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంపై అవగాహన కల్పించడంలో ఆయన పెద్దపాత్ర పోషించారు.
ఇప్పుడు మళ్లీ ప్రధాన పోలీసింగ్ బాధ్యతలకు వచ్చి చేరిన సజ్జనార్, 2021కి ముందు ఉన్న సైబరాబాద్ కమిషనర్ పదవి నుంచి ఇది మరింత అప్గ్రేడ్గా పరిగణిస్తున్నారు. రాబోయే ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో ఆయన కీలక మార్పులు తీసుకురావచ్చని అంచనా.
అంతకుముందు కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ గారు హోం డిపార్ట్మెంట్లో సీఎస్గా బదిలీ అయ్యారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!