
గాసిప్స్

ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపీ కే. కేశవరావు కుమారుడు వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బ్లాక్ మెయిల్, బెదిరింపుల కేసు నమోదు అయింది. బంజారాహిల్స్లోని ఇంటి క్రమబద్దీకరణ వ్యవహారానికి సంబంధించి రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ప్రకారం, ఆస్తికి సంబంధించి పిల్ దాఖలు చేసిన నిందితులు రూ.3 కోట్లు ఇస్తే కేసును ఉపసంహరిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి అంగీకరించకపోవడంతో మరిన్ని కేసులు వేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డిలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!