

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఆరో వార్డు నుంచి పోటీ చేస్తున్న చందాపూర్ గ్రామానికి చెందిన మహదేవప్ప (48) మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మహదేవప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరుల బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. స్థానిక మంత్రి శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే భాజపా ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!