

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. సాయి శ్రీనివాస్ త్వరలో కావ్యారెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఇటీవల హైదరాబాద్లో వీరి నిశ్చితార్థం అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 29న తిరుపతిలో వివాహం జరగనున్న నేపథ్యంలో బంధుమిత్రులు, ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.
ఈ క్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వివాహానికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్ను కూడా ప్రత్యేకంగా కలిశారు. సీఎంను కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. ఈ నెల 29న తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వివాహం జరగనుండగా, అనంతరం వచ్చే నెల 1న హైదరాబాద్లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.



















.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!