

మోహన్లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2 : ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విడుదల అనంతరం కొన్ని సన్నివేశాలపై వివాదాలు నెలకొన్నాయి. అయినప్పటికీ, కథను మూడో భాగానికి కూడా అవకాశం ఉండేలా ముగించినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ ‘లూసిఫర్ 3’పై స్పందిస్తూ, వివాదాలు వచ్చినంత మాత్రాన తాను వెనక్కి తగ్గనని, మూడో భాగం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.
అయన మాట్లాడుతూ, ‘ఎల్2’ ప్రతి ఒక్కరికీ నచ్చకపోవచ్చని, కానీ తన పనిపై నిబద్ధత మాత్రం మారదని తెలిపారు. ‘ఎల్3’ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్నలు తరచుగా వస్తున్నాయని, అయితే మోహన్లాల్ సమయం, అలాగే ముందుగా ఇచ్చిన నిర్మాతల హామీలు పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభిస్తానని చెప్పారు. కథ డిమాండ్ మేరకే ‘ఎంపురాన్’ రూపొందించామని, ప్రేక్షకులను అలరించడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు తీయడం తన లక్ష్యం కాదని, సోషల్ మీడియా యుగంలో అలాంటి పనులకు అది సరిపోతుందని కూడా వ్యాఖ్యానించారు.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!