

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ యాజమాన్యం మారిన విషయం తెలిసిందే. ఈ జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు కలిసి సుమారు రూ.16,706 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు డియాజియో ఆధీనంలో ఉన్న ఈ ఫ్రాంచైజీ, ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం కొత్త యాజమాన్యానికి బదిలీ కానుంది.
ఇదిలా ఉండగా, కొత్త యాజమాన్యం జట్టు పేరును మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ (ఆర్సీబీ) పేరు తమ బ్రాండ్కు సరిపోదని భావిస్తున్న వారు, జట్టుకు కొత్త పేరు పెట్టాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ‘రాయల్ కన్నడిగన్స్ బెంగళూరు’ (ఆర్కేబీ) అనే పేరును పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇది నిజమైతే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద ఐడెంటిటీ మార్పుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
కొత్త పేరుతో జట్టుకు స్థానిక గుర్తింపును పెంచాలని, ముఖ్యంగా కర్ణాటక అభిమానులను మరింతగా ఆకర్షించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఈ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. జట్టు పేరు మార్పుపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ వార్తలు ఐపీఎల్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

.png&w=3840&q=75)
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!