

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. స్త్రీశక్తి పథకాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య రాకపోకలకు 6,000 ప్రత్యేక బస్సులను కేటాయించింది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు మరో 2,432 ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
పండుగకు ముందు రోజుల్లో మొత్తం 3,857 ప్రత్యేక బస్సులు, తిరుగు ప్రయాణానికి 4,575 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్కు ఎక్కువ సంఖ్యలో బస్సులు కేటాయించగా, బెంగళూరు, చెన్నై మార్గాల్లో కూడా ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేయనుండగా, దూర ప్రయాణాల కోసం ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!