

విజయవాడకు చెందిన ఫిట్నెస్ యూట్యూబర్ ఫ్లెక్సాంథర్ మణి (మణికుమార్ చింతలపూడి) తన స్నేహితులు దివ్య, శివ మణి, గాయత్రిలతో కలిసి నేపాల్లోని ప్రపంచ ప్రఖ్యాత హిమాలయ పర్వత ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన ట్రెక్కింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ బృందం 4,919 మీటర్ల ఎత్తులో ఉన్న టిలిచో సరస్సు మరియు 5,416 మీటర్ల ఎత్తులోని థొరాంగ్ లా పాస్ వరకు చేరుకుని భారత జాతీయ జెండాను ఎగురవేసింది.
ప్రపంచంలోనే అత్యంత సవాలుగా భావించే అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్లో భాగంగా ఈ నలుగురు సభ్యులు చామే నుంచి ముక్తినాథ్ దేవాలయం వరకు కేవలం ఎనిమిది రోజుల్లో ప్రయాణాన్ని పూర్తి చేశారు. తక్కువ ఆక్సిజన్, ఎత్తైన పర్వతాలు, తీవ్ర చలి మరియు క్లిష్టమైన మార్గాలను అధిగమిస్తూ ఈ ఘనత సాధించారు. ట్రెక్కింగ్ అనంతరం భారత జెండాతో దిగిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ఫిట్నెస్, క్రమశిక్షణ, మానసిక దృఢత్వాన్ని పలువురు ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!