
గాసిప్స్
.jpg&w=3840&q=75)
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. ఈ ప్రక్రియ కోసం నిందితులకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై బయట ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా కొనసాగాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!