

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో కీలక రైలు సేవ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి మరియు అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో నడిచే ఈ రైలు 2026 ఈ నెల13 న కామాఖ్య నుండి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ రైలు ప్రారంభంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అసోం రాష్ట్రంతో నేరుగా అనుసంధానమవుతాయి.
అసోం రాష్ట్రం ఉత్తర తూర్పు భారతదేశంలోని ఏడు సోదరి రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా ఉండటంతో ఈ రైలు సేవ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తూర్పు ప్రాంతాలకు ప్రయాణించే దీర్ఘదూర ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రయాణించే సమయంలో ఈ రైలు రెండు దిశల్లోనూ శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు మరియు నల్గొండ స్టేషన్లలో ఆగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!