

బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రకటించిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని ఆయన తెలిపారు. ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) రాష్ట్రాలు రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. మొత్తం దేశ పెట్టుబడుల్లో ఈ మూడు రాష్ట్రాలు కలిపి 51.2 శాతం వాటా సాధించాయి.
దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు రూ.26.6 లక్షల కోట్లకు చేరాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే 11.5 శాతం వృద్ధి అని నివేదిక వెల్లడించింది. వేగవంతమైన నిర్ణయాలు, స్థిరమైన విధానాలే ఏపీ విజయానికి ప్రధాన కారణమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్, ఎనర్జీ, డిజిటల్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టితో మాన్యుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, మొబిలిటీ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కనెక్టివిటీ, ఫ్రెండ్లీ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారిందని ఆయన అన్నారు.



.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!