

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ రోజు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందబోతుందని, కేంద్ర సహకారంతో పార్లమెంట్లో బిల్లు ఆమోదం దిశగా వేగంగా సాగుతోందని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం పంపిన తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశపెట్టడం కీలకమని చెప్పారు. అమరావతి మనకు ఒక సెంటిమెంట్ అని పేర్కొంటూ, బిల్లుకు మద్దతు తెలిపిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
గత ఐదేళ్లలో అమరావతిని నిర్లక్ష్యం చేశారని విమర్శించిన చంద్రబాబు, మాజీ సీఎం జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలని, కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సవ్యంగా కొనసాగుతుందని, కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నేతలు పాల్గొని బిల్లు ఆమోదాన్ని స్వాగతించారు.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!