

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ముందు ఆయన అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రసంగంలో గవర్నర్ మాట్లాడుతూ, రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్కు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడించారు. గ్రూప్–1, 2, 3 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!