

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం నుంచి విడుదలైన రెండో గీతం ‘ప్రియసఖి’ ప్రస్తుతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, అనురాగం, మౌన భావోద్వేగాల చుట్టూ తిరిగే ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గేయ రచయిత సురేష్ బనిశెట్టి రాసిన సాహిత్యం హృదయానికి హత్తుకునేలా ఉండగా, కె.ఎస్. హరిశంకర్ తన మృదువైన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశారు. లండన్ నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్ ఈ గీతానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘బేబీ’ తర్వాత ఈ జంటపై ప్రేక్షకుల్లో ఏర్పడిన క్రేజ్ ఈ పాటతో మరింత పెరిగింది. ‘90s’ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భావోద్వేగ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!