

తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్పై సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కేసు నమోదు చేసింది. బాధితుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు కాగా, ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మిని కూడా అధికారులు విచారిస్తున్నారు.
ఫిర్యాదు ప్రకారం, పలు దఫాల్లో రూ.3.5 కోట్లు తీసుకున్నప్పటికీ సినిమా ప్రారంభించకపోవడమే కాకుండా, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. కేసు నమోదు చేసిన ఈవోడబ్ల్యూ అధికారులు డబ్బు లావాదేవీలు, సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆరోపణలపై దర్శకుడు గుడ్లూరి అశోక్ లేదా నిర్మాత విజయలక్ష్మి నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!