
సినిమాలు

పోక్సో కేసులో అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కేసుకు సంబంధించిన విషయాలపై మీడియాతో మాట్లాడకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బెయిల్ ఉత్తర్వులు వెలువడిన అనంతరం చర్లపల్లి జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్ నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు విధించిన అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. కేసు ప్రస్తుతం న్యాయస్థాన పరిధిలో కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!