

మహేష్బాబు హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన చిత్రం 'ఐ, నోబడీ' ప్రమోషన్స్లో పాల్గొంటున్న ఆయన, రాజమౌళి తనకు స్వయంగా కథ చెప్పిన అనుభవాన్ని పంచుకున్నారు. 'ఎంపురాన్' షూటింగ్ సమయంలో రాజమౌళి ఫోన్ చేసి విలన్ పాత్ర గురించి చర్చించారని, హైదరాబాద్లో దాదాపు మూడున్నర గంటల పాటు కథను అద్భుతంగా వివరించారని చెప్పారు. రాజమౌళి కథ చెప్పే విధానం ఒక సినిమా చూసిన అనుభూతిని కలిగించిందని ప్రశంసించారు.
రాజమౌళి చెప్పిన దానికంటే సినిమా తెరపై 100 రెట్లు గొప్పగా కనిపిస్తుందని, ప్రేక్షకులు తప్పకుండా "వావ్" అనకుండా ఉండరని పృథ్వీరాజ్ అన్నారు. ప్రతి దర్శకుడి పనితీరు భిన్నంగా ఉంటుందని, తాను ఎలాంటి పాత్రలోనైనా సులభంగా ఒదిగిపోగలనని చెప్పారు. షూటింగ్ ప్రక్రియను ఆస్వాదిస్తే ఏ పాత్రైనా సవాలుగా కాకుండా ఆనందంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 'వారణాసి'పై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!