

'రక్త చరిత్ర' నా సినీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో జరిగిన వాస్తవ సంఘటనలపై విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. 2010లో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన వర్మ, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని చూపించడమే సినిమా ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే 'రక్త చరిత్ర పార్ట్-3'కు అవకాశం లేదని, పార్ట్-2లో కథ పూర్తయిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా స్టార్ డామినేషన్, ఫ్యామిలీ సినిమాలు, మల్టీస్టారర్ చిత్రాలపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రేక్షకులు స్టార్ హీరోలను చూసే టికెట్లు కొనుగోలు చేస్తారని, అందువల్ల స్టార్ డామినేషన్ సహజమేనని అభిప్రాయపడ్డారు. తాను ఎప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంట్ లేదా పౌరాణిక చిత్రాలు తీయనని, రియలిస్టిక్ డ్రామాలే తనకు ఇష్టమని చెప్పారు. నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ వంకాయలపాటి మాట్లాడుతూ, కొత్త తరం ప్రేక్షకులకు ఈ క్లాసిక్ చిత్రాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!