

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు రాజమహేంద్రవరంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపై నిర్మాతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో రవి శంకర్, నాగ వంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాలు, ఆధునిక థియేటర్ల అవసరాన్ని నిర్మాతలు ప్రస్తావించారు. అలాగే పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి సమస్యలను కూడా వివరించారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించే దిశగా చర్యలు తీసుకునే సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!