
జనరల్

జాతీయ రాజధాని ఢిల్లీలో హత్యకు కుట్ర పన్నుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ముగ్గురు అనుమానిత షూటర్లను రోహిణి జిల్లా స్పెషల్ స్టాఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వీరికి విదేశాల్లో ఉన్న గ్యాంగ్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ముఠా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అవకాశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
అరెస్టైన నిందితులకు ఢిల్లీలో గతంలో జరిగిన పలు కాల్పుల ఘటనలతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ 'ఆపరేషన్ హార్డ్ బాల్' పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడైన గోల్డీ బ్రార్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.43 లక్షలు) బహుమతిగా ప్రకటించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!