

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై చేయడానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు ఇదే బ్యానర్లో రవితేజ నటించిన ధమాకా, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ‘మిస్టర్ బచ్చన్’ భారీ నష్టాలను మిగిల్చగా, ఆ సమయంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ, ఈ బ్యానర్తో రవితేజ మళ్లీ కలిసి పని చేసేలా స్క్రిప్ట్ చర్చలు జరగడం ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి రవితేజకు ఒక కథ ఐడియాను వినిపించగా, చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనుండగా, కథను వక్కంతం వంశీ అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా, 2026 రెండో భాగంలో షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!