
జనరల్

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా చేసిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 12,73,811 యూనిట్లకు చేరి తొలి త్రైమాసికంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 10,11,884 యూనిట్లతో పోలిస్తే 25.9 శాతం వృద్ధి నమోదైనట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించింది.
పశ్చిమాసియా సంక్షోభం, సరఫరా అంతరాయాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బలమైన డిమాండ్ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని సియామ్ తెలిపింది. ఇదే కాలంలో ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు 20.3 శాతం పెరిగి 56,28,675 యూనిట్లకు చేరగా, త్రిచక్ర వాహనాల విక్రయాలు 29.7 శాతం వృద్ధితో 2,14,339 యూనిట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!