

‘పెద్ది’ విజయంతో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విజయోత్సాహంలో ఉన్న చరణ్ తదుపరి ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ‘రంగస్థలం’ తర్వాత దర్శకుడు సుకుమార్తో మరోసారి ఆయన జతకట్టబోతుండటంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కథా పనులు దాదాపు పూర్తయ్యాయి. సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేసి రామ్ చరణ్కు ఫైనల్ నరేషన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చిన్న మార్పులు, చేర్పుల అనంతరం ఈ ఏడాది అక్టోబర్లో ముహూర్త కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించబోతుండటం విశేషంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ‘రంగస్థలం’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ భారీ ప్రాజెక్ట్ను కూడా నిర్మించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!