

టాలీవుడ్ను దాటి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్, వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన స్థాయి మరింత పెరిగింది. ఇప్పుడు ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ‘ఫౌజీ’ లో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారట. ఒక పాత్రలో పవర్ఫుల్ సైనికుడిగా, మరో పాత్రలో భావోద్వేగాలతో నిండిన వ్యక్తిగా నటించనున్నారని సమాచారం. కథ 1940 ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంతో సాగే పీరియడ్ వార్ డ్రామా. దేశభక్తి అంశాలతో పాటు బలమైన ప్రేమకథ కూడా ఇందులో ఉండనుందని చెబుతున్నారు. ప్రభాస్ ఆజాద్ హింద్ ఫోర్స్కు చెందిన సైనికుడిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రెండో భాగం ప్రీక్వెల్గా ఉండొచ్చని సమాచారం. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఇమాన్వి తెలుగు తెరకు పరిచయం కానుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల తేదీగా ఈ ఏడాది (2026) ఆగస్టు 14 ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!