
జనరల్

హైదరాబాద్ మెహదీపట్నంలో గోవుల తరలింపు ఆరోపణలతో రెండు వర్గాల మధ్య రాళ్లదాడి, ఘర్షణ చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో లారీని అడ్డుకోవడం, మరో వర్గం దానిని వ్యతిరేకించడం వల్ల వివాదం ముదిరి నడిరోడ్డుపై బాహాబాహీకి దారితీసింది. దీంతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో వాహనదారులు భయంతో పరుగులు తీశారు. తర్వాత స్థానిక నేతలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!