
షోస్

యూజీసీ-నెట్ పునఃపరీక్ష వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యవహారానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)నే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన. సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ సబ్జెక్టులకు యూజీసీ-నెట్ పరీక్షలు జూన్ 22 నుంచి 30 మధ్య జరిగాయని తెలిపారు.
అయితే, ఆ పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్లో మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీఏ సిద్ధమవుతోందని రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఎన్టీఏ తప్పు చేస్తే. దాని శిక్షను విద్యార్థులు ఎందుకు అనుభవించాలి? అని ఆయన ప్రశ్నించారు. పరీక్షలను రద్దు చేసి మరోసారి నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శిస్తూ, ఈ వ్యవహారానికి ఎన్టీఏను బాధ్యురాలిగా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!