
గాసిప్స్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేనని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా, వర్చువల్గా హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతించింది. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. తాజాగా నాంపల్లి కోర్టులో జరిగిన విచారణ అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!