

ఫెరారీ సంస్థ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ కారు ‘లూస్’ (Chassis 0) వేలంలో రికార్డు ధర పలికింది. అమెరికాలో నిర్వహించిన RM సోథబీస్ వేలంలో ఈ ప్రత్యేక కారు ఏకంగా 40 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.382 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేక డిజైన్తో రూపొందించిన ఈ వన్-ఆఫ్ కారు ఫెరారీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కారును 2027లో కొనుగోలుదారుడికి డెలివరీ చేయనున్నారు.
ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఫెరారీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే విద్యా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ప్రత్యేక డిజైన్తో పాటు ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారుగా నిలిచిన ‘లూస్’కు లభించిన భారీ ధర లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. అరుదైన కార్ల సేకరణదారుల్లో ఈ ప్రత్యేక మోడల్కు ఉన్న డిమాండ్ను ఈ రికార్డు వేలం మరోసారి చాటిచెప్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!