
సినిమాలు

సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని, ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని సంస్థ స్పష్టం చేసింది. సురక్షితమైన, ఆధునిక మరియు పర్యావరణహిత ప్రజారవాణా సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపింది.
ప్రధాని ఈ-బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇందులో 11 నగరాలకు 750 బస్సులు, తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్ల కోసం 300 బస్సులు ఉన్నాయి. టెండర్లను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించగా, పినాకిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ బస్సులను సరఫరా చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!