
రాజకీయాలు

అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ చేశారు. APPSC గ్రూప్-1 అక్రమాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 తరహా స్కామ్ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో గ్రూప్-1 అక్రమాలపై చర్చిస్తామని తెలిపారు.
డీఎస్సీ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. డీఎస్సీలో మహిళా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. ఆత్మాభిమానంతోనే డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. గ్రూప్-1, డీఎస్సీ అంశాలపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై అసెంబ్లీ చర్చలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!