

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.23,321.38 కోట్ల వ్యయం చేసినట్లు కాగ్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో రాబడి రూపంలో రూ.12,510 కోట్లు వచ్చినప్పటికీ, మరో రూ.10,901.21 కోట్లు అప్పుల రూపంలో సమీకరించినట్లు పేర్కొంది. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఉన్న మొత్తం రాబడిలో కేవలం 5 శాతం మాత్రమే తొలి నెలలో రావగా, ఖర్చులో ఇప్పటికే 7.65 శాతం వినియోగించబడినట్లు నివేదిక తెలిపింది.
ఏప్రిల్ నెలలోనే రాష్ట్రానికి రూ.10,277 కోట్ల రెవెన్యూ లోటు నమోదవడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తోంది. రెవెన్యూ రాబడి రూ.12,510 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.22,787.95 కోట్లకు చేరింది. రాష్ట్ర సొంత ఆదాయం రూ.12,086 కోట్లుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందకపోవడం వల్ల మొత్తం రెవెన్యూ రాబడి తగ్గిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!