
జనరల్

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. శివనామస్మరణలతో హిమగిరులు మార్మోగుతుండగా, యాత్రికుల నాలుగో బృందం 291 వాహనాల్లో అమర్నాథ్ గుహ వైపు బయల్దేరింది. భక్తుల భద్రత కోసం కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాయి.
యాత్ర తొలి రోజే 32,313 మంది భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. యాత్ర భద్రతా ఏర్పాట్లను ఐటిబీపీ డీజీ శత్రుజీత్ స్వయంగా పరిశీలించి, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!