
సినిమాలు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన జేఎన్యూ మాజీ నేత ఉమర్ ఖాలిద్కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తల్లి శస్త్రచికిత్స నేపథ్యంలో మానవతా దృక్పథంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ మధు జైన్ ధర్మాసనం జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
అయితే కోర్టు ఉమర్ ఖాలిద్పై పలు కఠిన ఆంక్షలు విధించింది. తల్లిని ఆస్పత్రిలో కలవడానికి మాత్రమే వెళ్లాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. రూ.1 లక్ష పూచీకత్తు సమర్పించాలని, ఇంటికే పరిమితం కావాలని ఆదేశించింది. అలాగే ఆయన కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని పోలీసులకు కోర్టు సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!