
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఉదయం 8.45 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకోనున్న సీఎం ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యాల విస్తరణ నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆలయానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వేద పాఠశాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుడనున్నారు. యాదగిరిగుట్టను దేశస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పనులను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!