
సినిమాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫు న్యాయవాదులు డెక్కన్ క్రానికల్ పత్రికకు పరువు నష్టం న్యాయ నోటీసులు జారీ చేశారు. జూలై 8, 2026న ప్రచురితమైన "కేటీఆర్స్ 'ల్యాండ్లార్డ్' బిల్డ్స్ టవర్ ఇన్ హుస్సేన్సాగర్" కథనం పూర్తిగా తప్పుడు, నిరాధారమైన ఆరోపణలతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో ప్రచురించారని నోటీసులో పేర్కొన్నారు.
హుస్సేన్సాగర్ సమీపంలోని భవన అనుమతులను జన్వాడ ఫామ్హౌస్తో అనుసంధానం చేస్తూ అసత్య కథనం ప్రచురించారని ఆరోపించారు. 48 గంటల్లోగా ఆ కథనం, దానికి సంబంధించిన డిజిటల్ లింకులను తొలగించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు నష్టపరిహారం కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!