
రాజకీయాలు

దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు హీరోయిన్ ఈషా రెబ్బా ఇటీవల హైదరాబాద్ ఎయిర్పోర్టులో కలిసి కనిపించడంతో వీరిద్దరి పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతుండగా, తాజాగా కలిసి కనిపించడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తనకు "బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ" అని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో తమ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని కూడా చెప్పారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ సంబంధం లేదా పెళ్లి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఎయిర్పోర్టులో కలిసి కనిపించడం మరోసారి సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!