
రాజకీయాలు

ప్రపంచ బ్యాంక్ తెలంగాణను ఎగువ మధ్య ఆదాయ (Upper Middle Income) ఆర్థిక వ్యవస్థగా గుర్తించడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి, సమర్థవంతమైన పాలనకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక ప్రగతికి ప్రపంచ స్థాయి గుర్తింపుగా నిలిచిందని ఆయన అన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.19 లక్షల (5,407 అమెరికన్ డాలర్లు) తలసరి ఆదాయంతో తెలంగాణ ప్రపంచ బ్యాంక్ ఎగువ మధ్య ఆదాయ కేటగిరీలో చేరిందని, ఈ ఘనత సాధించిన ఐదు భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. గత దశాబ్దంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన వేగవంతమైన ఆర్థిక పరివర్తనకు ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!