
సినిమాలు

ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సమస్యపై ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ధర్నాలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.
పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యానికి అవసరమైన నిధుల్లో 70 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని కిషన్రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)కి అప్పగించే వరకు అయ్యే ప్రతి రూపాయిని కేంద్రం చెల్లిస్తోందని చెప్పారు. అయినప్పటికీ, ధాన్యం సేకరణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!