

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు మరియు గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈసారి మహానాడును ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించామని గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
తెలుగువారికి మహానాడు ఒక భావోద్వేగమని, పార్టీ నుంచి వచ్చే సందేశాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈసారి “స్త్రీశక్తి” థీమ్తో కార్యక్రమం జరగనుందని తెలిపారు. కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు మరియు బాధ్యతగల పదవుల్లో ఉన్నవారిలో జవాబుదారీతనం ఉండాలని, అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలమని అన్నారు. ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!