
జనరల్

భారత్ రక్షణ రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం కల్పించే దిశగా భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
త్వరలో అర్హత కలిగిన ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అస్త్ర-2 (Astra Mk-2) క్షిపణి తయారీ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చర్యతో స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధి, వేగవంతమైన ఉత్పత్తి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!