

దిల్లీలో మొబైల్ యాప్ల ద్వారా ఈ-రిక్షాలను స్విచ్ ఆఫ్ చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. చైనా తయారీ బాట్-బీఎంఎస్ యాప్ను ఉపయోగించి వాహనాలను నిలిపివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు బ్లూటూత్ ద్వారా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్కు కనెక్ట్ అయి డిశ్చార్జ్ స్విచ్ను ఆన్ చేయడంతో ఈ-రిక్షాలు ఆగిపోతున్నాయి. ఇదే విధంగా ఎపోచ్ లిథియం అయాన్ యాప్తో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలతో ఈవీ డ్రైవర్లు, డీలర్లు, వినియోగదారుల్లో ఆందోళన పెరుగుతోంది. పాస్వర్డ్లు, భద్రతా ప్రమాణాలు ఉన్నప్పటికీ వాటి దుర్వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని దిల్లీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది. రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ యాప్లు బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి రూపొందించబడ్డాయని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!